నేపాల్కి చెందిన 14 ఏళ్ళ బాలికపై ఇటీవల యాసిడ్ దాడి జరిగింది. ఆ దాడి చేసింది ఆమె స్కూల్ విద్యార్ధులే. చదువులో బాగా రాణిస్తున్నదనే కారణంతో ముస్కాన్పై కోపం పెంచుకున్న తోటి విద్యార్ధులు టైం చూసుకొని ముఖంపై యాసిడ్ దాడి చేశారు. దీంతో ముఖం ఒక సైడు పూర్తిగా కాలిపోయింది. అదృష్టవశాత్తు కళ్ళకి ఏం కాలేదు. అయితే తన ముఖం పూర్తిగా కాలిపోవడంతో ధైర్యాన్ని కోల్పోయి చనిపోయేందుకు సిద్దమైంది ఆ 14 ఏళ్ళ బాలిక. ఈ విషయం తెలుసుకున్న వరుణ్ ధావన్, కృతిసనన్ ఆమెలో ధైర్యాన్ని నింపారు. ముస్కాన్ బాలీవుడ్ స్టార్స్ కృతిసనన్, వరుణ్ ధావన్లని ఎంతగానో అభిమానిస్తుంది. ఓ వ్యక్తి ద్వారా ముస్కాన్కి జరిగిన విషయం కృతిసనన్కి చేరింది. వెంటనే వీడియో కాల్ ద్వారా ఆమెతో మాట్లాడింది. తన అభిమాన హీరోయిన్ మాట్లాడేసరికి ముస్కాన్ చాలా సంతోషించింది. ఇక ఈ విషయం గురించి కృతిసనన్ తన కోస్టార్ వరుణ్ ధావన్కి కూడా చెప్పింది. వెంటనే ఆయన ట్విట్టర్లో వీడియో ద్వారా స్పందించారు. “ముస్కాన్ గురించి కృతి చెప్పింది. నేను ముస్కాన్ని కలవాలనుకుంటున్నాను. నువ్వు ధైర్యాన్ని కోల్పోవద్దు. బతికి సాధించి చూపాలి. చదువులో ఉన్నతంగా రాణించి దాడి చేసిన వారిపై పగ తీర్చుకోవాలి. నేను నేపాల్ త్వరలోనే వస్తాను” అని వరుణ్ పేర్కొన్నారు. తన అభిమాన స్టార్స్ మాటలు విన్న ముస్కాన్ ఎంతగానో సంతోషించింది.
previous post