వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న చిత్రం కమ్మ రాజ్యంలో కడప రెడ్లు. నవంబర్ 29 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో చిత్ర ప్రమోషన్ ను భారీగా చేస్తూ సినిమా ఫై ఇంకాస్త క్రేజ్ తీసుకొస్తున్నాడు. ఇప్పటికే ట్రైలర్ , సాంగ్స్ లతో రాజకీయ వర్గాల్లో సెగలు రేపిన వర్మ..మా సినిమాలో ఎవరినీ లక్ష్యంగా చేసుకోలేదు..ఎవరినీ ప్రత్యకంగా టార్గెట్ గా చేసుకోలేదని ప్రమోషన్లలో చెప్పసాగాడు.
ఇది ఒక ఎంటర్ టైనర్ అని.. ఈ సినిమాను ఏకంగా ఎనిమిది వందల థియేటర్లలో విడుదల చేయబోతున్నట్టుగా ప్రకటించుకున్నాడు. సినిమాలో మొత్తం ఏడు పాటలున్నాయని, వాటిల్లో ఇప్పటికే ఒకటి వైరల్ అయ్యిందని ఆర్జీవీ చెప్పుకొచ్చాడు. ‘పప్పులాంటి అబ్బాయి..’ పాట బాగా వైరల్ అయ్యిందని, మిగతా పాటలు కూడా హైలెట్ అవుతాయని ధీమా వ్యక్తం చేస్తున్నాడు.