అక్కినేని నాగర్జున మేనల్లుడు, హీరో సుమంత్ రెండో పెళ్ళి చేసుకోబుతున్నట్లు కొంత కాలంగా సోషల్ మీడియాలో వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. సుమంత్ ఇదివరకే హీరోయిన్ కీర్తి రేడ్డిని పెళ్ళిచేసుకున్న విషయం తెలిసిందే. వాళ్ళిద్దరు పెళ్ళి అయిన రెండేళ్లకే కొన్ని కారణలు వల్ల వీడాకులు తీసుకున్నారు. కొంతకాలంగా సుమంత్ ఒంటరిగానే ఉంటున్నాడు.
ఈ క్రమంలోనే సుమంత్ రెండో పెళ్ళి చేసుకోబుతున్నట్లు, ఆ అమ్మాయి పేరు పవిత్ర అని వెడ్డింగ్ కార్డ్ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. SP అనే అక్షరాలు హైలెట్ అయ్యేలా డిజైన్ చేసిన వెడ్డింగ్ కార్డ్ వైరల్ అవుతుంది.
ఈ నేపథ్యంలో సుమంత్ పెళ్ళిపై వివాదస్పద డైరెక్టర్ రాంగోపాల్ వర్మ కామెంట్ చేశారు. ఒక్కసారి పెళ్ళయ్యాక కూడా నీకింకా బుద్ది రాలేదా సుమంత్..! నీ కర్మ ..ఆ పవిత్ర ఖర్మ.. పెళ్ళేంటే నూరేళ్ళ పెంట..రెండో పెళ్ళేంటయ్యా సామీ ? నా మాట విని ఈ పెళ్ళి ఆపండి, పవిత్ర గారు మీ జీవితాలను పాడుచేసుకోకండి అని ట్వీట్ చేశాడు.
తప్పు మీది కాదు, సుమంత్ ది కాదు దౌర్భాగ్య వ్యవస్థది అంటూ.. వర్మ ట్వీట్ చేయడంతో వైరల్గా మారింది.