telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఈ లాక్‌డౌన్ వనితలను వణికిస్తోంది : వరలక్ష్మి శరత్ కుమార్‌

varalakshmi

వరలక్ష్మి శరత్ కుమార్‌ చేసింది తక్కువ సినిమాలే అయినా కూడా మంచి ఇమేజ్ సంపాదించుకుంది. శరత్ కుమార్ కూతురు గానే కాకుండా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఈ లాక్‌డౌన్‌ సమయంలో అభిమానులతో ముచ్చటించింది వరలక్ష్మి. ముఖ్యంగా ఈ సమయంలో గృహిణిలు ఎదుర్కొంటున్న సమస్యపై మాట్లాడింది ఈమె. ఈ లాక్‌డౌన్ సమయంలో గృహ హింస కేసులు కూడా బాగా నమోదవుతున్నాయని పోలీసులు కూడా చెప్తున్నారు.. లెక్కలు కూడా చెప్తున్నాయి. ఈ లాక్‌డౌన్ అందుకే వనితలను వణికిస్తోంది. స్వేచ్ఛను హరించడంతో పాటు మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు ఆడవాళ్లు. కరోనా వైరస్‌ ఆడవాళ్లకు ప్రియమైన శత్రువుగా మారింది. ఈ లాక్‌డౌన్‌ సమయంలో మహిళలపై వేధింపులు ఎక్కువయ్యే అవకాశాలున్నాయని.. నాలుగు గోడల మధ్య ఏదైనా జరగొచ్చని వరలక్ష్మి శరత్‌ కుమార్‌ అభిప్రాయపడుతుంది. గృహ హింసకు గురవుతున్న మహిళలకు సాయం చేయమంటూ ఆమె హెల్ప్‌లైన్‌ నెంబరును ట్విటర్‌లో షేర్‌ చేసింది. మన చుట్టూ ఉన్న మహిళలకు సాయం చేద్దాం.. ఈ లాక్‌డౌన్‌లో గృహ హింస నుంచి వారిని కాపాడుదాం.. వాళ్లు ఇంట్లోనే చిక్కుకుని ఉండొచ్చు.. దయచేసి మీకు తెలిసిన మహిళలకు 1800 102 7282 నెంబరును షేర్‌ చేయండి అంటూ ట్వీట్ చేసింది.

Related posts