సౌత్ హీరోయిన్ వరలక్ష్మీ శరత్ కుమార్ కేవలం హీరోయిన్ పాత్రలే కాకుండా విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా రాణిస్తోంది. ఎలాంటి పాత్రలో అయినా ఒదిగిపోయి నటించడం, మనసులోని మాటలని నిర్భయంగా బయటకు చెప్పగలగడం ఆమె ప్రత్యేకత. ఆ మధ్య వరలక్ష్మీకి, విశాల్కి పెళ్ళి జరగబోతుందంటూ వార్తలు రాగా, ఆ వార్తలని కొట్టిపారేసింది ఈ తమిళ భామ. అయితే వరలక్ష్మీ తాజాగా విశాల్ని ఉద్ధేశిస్తూ చేసిన ట్వీట్ హాట్ టాపిక్ గా మారింది. వివరాలలోకి వెళితే నడిఘర్ సంఘానికి 2019 – 2022 ఏడాదికిగానూ రానున్న 23వ తేదీన ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో విశాల్ పాండవర్ జట్టు, కే.భాగ్యరాజ్ స్వామిశంకరదాస్ జట్టు బరిలోకి దిగుతున్నాయి. ఈ సారి కూడా పోటీ బలంగా ఉండడం, ఎన్నికలకు మరో 9 రోజులే గడువు ఉండడంతో ప్రచార మోత మొదలైంది. ఈ క్రమంలో విశాల్.. శరత్ కుమార్పై మాటల తూటాలు పేల్చాడు. దీంతో వరలక్ష్మీ శరత్ కుమార్ విశాల్ని ఉద్దేశిస్తూ “తాజాగా ఎలక్షన్ ప్రచారంలో నువ్వు మాట్లాడిన వీడియో చూశాను. అందులోని మాటలు నమ్మశక్యంగా లేవు. నువ్వు రీల్ హీరో అని నాకు తెలుసు. కాని రియల్ హీరోగా కూడా ఉంటావని ఆశిస్తున్నాను. ముఖ్యంగా నువ్వు నా ఓటు కోల్పోయావు” అంటూ సుధీర్ఘ పోస్ట్ లో తెలిపింది వరలక్ష్మీ.
జగన్ కు అనుభవం లేదు… మార్పు మంచిదే… హీరో కామెంట్స్