telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ప్రజలు ఇచ్చే తీర్పుతో జగన్ వెన్నులో వణుకు పుట్టాలి: వంగవీటి రాధా

Vangaveeti Raadha Election compaign TDP

ఈ సారి ఎన్నికల్లో ప్రజలు ఇచ్చే తీర్పుతో జగన్ వెన్నులో వణుకు పుట్టాలని టీడీపీ నేత వంగవీటి రాధా అన్నారు. ఆ భయంతో ఆయన హైదరాబాద్ పారిపోయేలా చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ ఓటమి జగన్ చిరస్థాయిగా గుర్తుండిపోవాలన్నారు. టీడీపీ అభ్యర్థుల తరపున శనివారం కృష్ణ జిల్లాలో రాధా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…రాష్ర్ట గౌరవాన్ని తాకట్టు పెట్టిన జగన్‌ తన స్వప్రయోజనాల కోసం కేంద్రంతోను, కేసీఆర్‌తోను చేతులు కలిపారని దుయ్యబట్టారు.

ప్రజా సమస్యలపై పోరాడాల్సిన పార్టీ ప్రజలను మోసం చేసిందన్నారు. క్రిమినల్‌ జగన్‌కు ఓటు వేస్తే రాష్ట్ర పరిస్థితి ఏలా ఉంటుందో ఆలోచించుకోవాలని సూచించారు. ఎన్నికల్లో గెలిపిస్తే ఓట్లు వేసారా లేదా అని చూసి మాట్లాడే వలస నాయకుడు జోగికి ఈ సారి బుద్ధి చెప్పాలన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేస్తున్న టీడీపీ నేతలకు ఓట్లు వేసి గెలిపించాలని కోరారు.

 

Related posts