telugu navyamedia
సినిమా వార్తలు

శివుని ఆశీస్సులతో అద్భుతమైన ప్రదేశంలో “వాల్మీకి” షూటింగ్

Valmiki images

హరీశ్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా “వాల్మీకి” చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కొంతకాలం క్రితం తమిళంలో వచ్చిన “జిగర్తాండ” సినిమాకు ఇది రీమేక్. ఆ సినిమాలో బాబీసింహా పోషించిన పాత్రను వరుణ్ తేజ్, సిద్ధార్థ్ పోషించిన పాత్రను అధర్వ మురళి చేస్తున్నారు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన హీరోయిన్ గా పూజా హెగ్డే కనిపించనుంది. “వాల్మీకి” చిత్రాన్ని ఆచంట రాము, గోపినాథ్ లు 14రీల్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 6న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. ఈ చిత్ర షూటింగ్ తాజాగా ప్ర‌ముఖ శివ క్షేత్రం యాగంటిలో జ‌రుపుకుంటుంది.

ఈ విష‌యాన్ని ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలిపాడు. షూటింగ్ లొకేష‌న్‌కి సంబంధించిన ఫోటో షేర్ చేస్తూ.. “శివుని ఆశీస్సులతో ఈ అద్భుతమైన ప్రదేశంలో షూటింగ్ మొదలుపెట్టాం” అని సందేశం ద్వారా తెలిపారు. ఈ షెడ్యూల్‌లో వ‌రుణ్ తేజ్‌తో పాటు బ్ర‌హ్మాజీ, పూజా హెగ్డే పాల్గొంటార‌ని తెలుస్తుంది. ఈ షెడ్యూల్ కోసమే వ‌రుణ్ నిన్న హైద‌రాబాద్ నుండి బ‌య‌లు దేర‌గా వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలోని రాయినిపేట వద్ద ప్ర‌మాదం జరిగింది. ఇండికా కారు వ‌రుణ్ తేజ్ ప్రయాణిస్తున్న ఆడికారుని ఢీకొట్ట‌డంతో ఈ ప్ర‌మాదం జ‌రిగింది. స్వ‌ల్ప గాయాల‌తోనే వ‌రుణ్ పెద్ద ప్ర‌మాదం నుండి బ‌య‌ట‌ప‌డ్డాడు.

Related posts