telugu navyamedia
సినిమా వార్తలు

అనంతపురంలో “వాల్మీకి” చిత్రీకరణ

Valmiki

హరీశ్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా “వాల్మీకి” చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కొంతకాలం క్రితం తమిళంలో వచ్చిన “జిగర్తాండ” సినిమాకు ఇది రీమేక్. ఆ సినిమాలో బాబీసింహా పోషించిన పాత్రను వరుణ్ తేజ్, సిద్ధార్థ్ పోషించిన పాత్రను అధర్వ మురళి చేస్తున్నారు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ సరసన హీరోయిన్ గా పూజా హెగ్డే కనిపించనుంది. మృణాళిని ర‌వి మరో హీరోయిన్ గా నటిస్తోంది. “వాల్మీకి” చిత్రాన్ని ఆచంట రాము, గోపినాథ్ లు 14రీల్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 6న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. ఇటీవల “వాల్మీకి” ప్రీ రిలీజ్ టీజ‌ర్ విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ప్ర‌స్తుతం సినిమా అనంత‌పురంలో చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది. ఈ విష‌యాన్ని ద‌ర్శ‌కుడు హ‌రీశ్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలిపారు.

Related posts