గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ టీడీపీకి గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. అయితే తనపై కొన్నిరోజులుగా టీడీపీ వర్గీయులు సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేస్తున్నారని వంశీ ఆరోపిస్తున్నారు. మార్ఫింగ్ చేసిన ఫొటోలతో తన పరువుప్రతిష్టలు దెబ్బతీస్తున్నారంటూ వంశీ విజయవాడ పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో, సీబీఎన్ విజన్, రాయలసీమ ప్రైడ్ డాట్ కామ్ అనే వెబ్ సైట్లు మూతపడ్డాయని, వాటి అడ్మిన్లు ఇంటర్నెట్ నుంచి సైట్లను తొలగించారని వల్లభనేని వంశీకి చెందిన ఫేస్ బుక్ పేజీలో వెల్లడించారు.
లేనిది ఉన్నట్టు సృష్టించడం టీడీపీ నైజం: మంత్రి బుగ్గన