గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ టీడీపీకి వ్యతిరేకంగా మాట్లాడిన దగ్గర నుంచి ఆ పార్టీ నేతలు ఆయనపై మాటల దాడి చేస్తున్నారు. అయితే ఎమ్మెల్యే వంశీ మోహన్ కూడా ఎదురుదాడికి దిగుతున్నారు. ఓ టీవీ చానల్లో జరిగిన డిబేట్లో ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్పై వంశీమోహన్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వైవీబీ వర్గీయులు ఉయ్యూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారం టీడీపీతో సహా రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది.
ఈ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ పార్టీపై అలకబూనారు. వల్లభనేని వంశీ మోహన్ తనను వ్యక్తిగతంగా దూషించినా పార్టీ పట్టించుకోలేదని మనస్తాపానికి లోనయ్యారు. తాపీగా సాయంత్రం స్పందించడం ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ న్యాయ సహాయం చేస్తే వంశీపై పోరాడతానని అనుచరులతో ఆయన అన్నట్లు సమాచారం.