ఏపీ సీఎం వైఎస్ జగన్ ను గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మంగళవారం సచివాలయంలో కలిశారు. వంశీ సీఎంతో సుమారు అరగంటకు పైగా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక విషయాలపై చర్చించినట్లు తెలుస్తోంది. మంత్రి కొడాలి నాని దగ్గరుండి సీఎంతో వంశీని సమావేశపరిచారని తెలుస్తోంది. అయితే భేటీ అనంతరం వంశీ మీడియాతో మాట్లాడేందుకు ఆసక్తి చూపలేదు.
గన్నవరం నియోజకవర్గానికి సంబంధించిన సీఎంఆర్ఎఫ్ చెక్కుల విషయం మాట్లాడడానికి సచివాలయానికి వచ్చానని ఒకే ఒక్క మాట చెప్పి సచివాలయం నుంచి మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. అయితే వైసీపీలో చేరికపై, రాజీనామా చేస్తే పరిస్థితేంటి..? ఉప ఎన్నిక వస్తే ఎలా..? ఇలా పలు అంశాలు వీరి మధ్య చర్చకు వచ్చినట్టు సమాచారం.
కేసీఆర్కు బీజేపీ భయం పట్టుకుంది: లక్ష్మణ్