ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు తనయుడు లక్ష్ చదలవాడ హీరోగా, హిప్పీ ఫేమ్ దిగంగన సూర్యవంశీ హీరోయిన్గా రమేశ్ కడుముల దర్శకత్వంలో “వలయం” చిత్రం తెరకెక్కుతోంది. శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి రామకృష్ణ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. రవిప్రకాశ్, రవి వర్మ, నోయెల్ సేన్, చిత్రం శ్రీను తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా టీజర్ విడుదల చేశారు. ఇందులో హీరో తన భార్యని వెతికే ప్రయత్నం కోసం అనేక ఆలోచనలు చేస్తుంటారు. మిస్టరీ థ్రిల్లర్గా మూవీ రూపొందినట్టు టీజర్ని బట్టి అర్ధమవుతుంది. ఫిబ్రవరి 2020లో వలయం సినిమా విడుదల కానుంది.
ఇక చదలవాడ లక్ష్మణ్ కెరీర్ ప్రారంభంలో హీరోగా రాణించాలనుకున్నారు. ఒకట్రెండు సినిమాలు కూడా చేశారు. అయితే అవేవీ హిట్ కాకపోవడంతో లక్ష్మణ్ అలియాస్ లక్ష్ సైలెంట్గా ఉండిపోయాడు. తాజాగా.. మరోసారి లక్ష్ హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. బిచ్చగాడు, డి 16, టిక్ టిక్ టిక్ వంటి వైవిధ్యమైన చిత్రాలతో పలు చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్. ఈ బ్యానర్పై చదలవాడ శ్రీనివాసరావు పలు హిట్ చిత్రాలని రూపొందించారు.
ఈ సారి కంటెస్టెంట్లు బోర్ కొట్టిస్తున్నారు..