telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

కరోనా వ్యాక్సిన్‌ : మ‌రో గుడ్ న్యూస్ చెప్పిన ఫైజ‌ర్ సంస్థ

క‌రోనాతో వ‌ణికిపోతున్న ప్రపంచానికి మ‌రో గుడ్ న్యూస్ చెప్పింది ఫైజ‌ర్ సంస్థ. త‌మ వ్యాక్సిన్ 12 నుంచి 15 ఏళ్ల వ‌య‌సు వారిపై 100 శాతం స‌మ‌ర్థవంతంగా ప‌ని చేస్తున్నట్లు క్లినిక‌ల్ ట్రయ‌ల్స్‌లో తేలిన‌ట్లు ప్రకటించింది. పిల్లల‌పై 100 శాతం స‌మ‌ర్థంగా ప‌ని చేస్తుంద‌ని ప్రక‌టించిన తొలి వ్యాక్సిన్ ఇదే కావ‌డం గ‌మ‌నార్హం. ఈ ఫ‌లితాల‌తో త్వర‌లోనే ప్రపంచ దేశాలు పిల్లల‌కు కూడా వ్యాక్సిన్లు ఇచ్చేందుకు మార్గం సుగ‌మ‌మైంది. ఇంత వ‌ర‌కూ పిల్లల‌పై వ్యాక్సిన్ల‌కు సంబంధించిన పూర్తి డేటా అందుబాటులో లేక‌పోవడంతో కేవ‌లం పెద్దల‌కు మాత్రమే ఇస్తున్నారు. తాజాగా ఫైజ‌ర్ ప్రక‌ట‌న‌తో పిల్లల‌కూ వ్యాక్సినేష‌న్ ఇచ్చే ప్రక్రియ‌కు లైన్ క్లియ‌రైన‌ట్లే క‌నిపిస్తోంది.

Related posts