శ్రీనివాస్ రెడ్డి అనే కిరాతకుడు అమాయకులైన అమ్మాయిలపై అఘాయిత్యాలకు పాల్పడి, వారిని అతి దారుణంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన హాజీపూర్ గ్రామాన్నే కాకుండా తెలుగురాష్ట్రాల్లో సంచలనం రేపింది. ఈ ఘటన పై కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు స్పందించారు. అమాయకులైన అమ్మాయిలపై అఘాయిత్యాలకు పాల్పడిన నిందితుడు శ్రీనివాస్రెడ్డి పై చర్యలు తీసుకోవాలని అన్నారు.
హాజీపూర్ బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఘటన వెలుగులోకి వచ్చి రెండు నెలలు అవుతున్నాఇంత వరకు నష్టపరిహారం చెల్లించలేదని ఆయన విమర్శించారు. హాజీపూర్ బాధితులను ఆదుకునేందుకు ఎందుకు ముందుకు రావట్లేదని వీహెచ్ ప్రశ్నించారు. మరో వైపు నిందితుడు శ్రీనివాస్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారిస్తున్నారు. ప్రస్తుతం అతడిని మరోసారి కస్టడీలోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.