telugu navyamedia
క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు సామాజిక

వైద్య సిబ్బందిపై రాళ్లదాడి..అంబులెన్స్ ధ్వంసం

Attack medical police staff

కోవిడ్-19 అనుమానితులను తీసుకెళ్లేందుకు వచ్చిన వైద్య సిబ్బందిపై స్థానికులు రాళ్లతో దాడిచేశారు. ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో ఈ ఘటన జరిగింది. స్థానిక నవాబ్‌పురా కాలనీలో ఇద్దరు కరోనా అనుమానితులు ఉన్నట్టు వైద్యులకు సమాచారం అందింది. దీంతో వారిని తీసుకెళ్లేందుకు పోలీసులతో కలిసి వైద్య సిబ్బంది అంబులెన్స్‌లో అక్కడికి చేరుకున్నారు.

వారి రాకను గమనించిన స్థానికులు అంబులెన్స్, పోలీసు వాహనాలపై రాళ్లు, ఇటుకలతో దాడిచేసి వాహనాలను ధ్వంసం చేశారు. ఈ దాడిలో పోలీసులు, వైద్య సిబ్బందికి గాయాలయ్యాయి. దాడికి పాల్పడిన 10 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, మరికొందరి కోసం గాలిస్తున్నారు. విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్రంగా స్పందించారు. దాడికి పాల్పడిన వారిపై జాతీయ భద్రత చట్టం కింద కేసులు నమోదు చేయాలని ఆదేశించారు.

Related posts