telugu navyamedia
రాజకీయ వార్తలు

అయోధ్యలో 251 మీటర్ల ఎత్తుతో రాముడి విగ్రహం: సీఎం యోగి

Mamatha Break Yogi Rali West Bengal

ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా అయోధ్యలో 251 మీటర్ల ఎత్తుతో శ్రీ రాముడి విగ్రహం నిర్మిస్తున్నట్టు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. గుజరాత్ లో నిర్మించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం కంటే ఇది ఇంకా ఎత్తు ఉంటుందన్నారు. పటేల్ విగ్రహం ఎత్తు 183 మీటర్లు. 100 ఎకరాల ప్రదేశంలో రాముడి విగ్రహం ఏర్పాటు చేస్తున్నట్టు యోగి వెల్లడించారు.

విగ్రహ నిర్మాణం విషయంలో గుజరాత్ ప్రభుత్వ సాయం తీసుకుంటున్నట్టు యోగి చెప్పారు. పర్యాటకులకు అవసరమైన అన్ని ప్రాథమిక సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని అన్నారు. డిజిటల్ మ్యూజియం, గ్రంథాలయం, ఫుడ్ ప్లాజా, రామాయణం ఇతివృత్తం నేపథ్యంలో పార్కులు, భారీ పార్కింగ్ సదుపాయం ఏర్పాటు చేస్తున్నామని యోగి పేర్కొన్నారు.

Related posts