తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి స్పందించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని గాంధీభవన్లో ఆయన జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..మున్సిపల్ పోల్స్లో మా ఓటింగ్ శాతం పెరిగిందన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమని ఆయన అన్నారు. ప్రజల ఉద్యమాలను కేసీఆర్ ఉక్కుపాదంతో అణచివేస్తున్నారనదుయ్యబట్టారు.
ప్రతిపక్ష నేతలను బెదిరించి టీఆర్ఎస్లో చేర్చుకుంటున్నారని అన్నారు.ఓ వర్గం ప్రజలను కేంద్ర ప్రభుత్వం తక్కువగా చూస్తోందని, మతం రంగుపులిమి అణచివేస్తోందని విమర్శలు గుప్పించారు. ప్రజాభిప్రాయాన్ని గౌరవించే పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని ఆయన చెప్పుకొచ్చారు. అందుకే తమ పార్టీ దేశాన్ని సుదీర్ఘకాలం పాలించిందని చెప్పారు.సీఏఏ విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ నాటకాలు ఆడుతున్నారని ఉత్తమ్కు అన్నారు.
ఎన్ని కుట్రలు చేసినా కాంగ్రెస్ దే విజయం: ఉత్తమ్