అధికార టీఆర్ఎస్ పార్టీ, బీజేపీలపై టీపీసీసీ ఉత్తమ్ కుమార్ రెడ్డి నిప్పులు చెరిగారు. కల్వకుంట్ల కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుందని…. 500 రూపాలు.. బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చి కేసీఆర్ సభకు జనాన్ని తీసుకొచ్చారని పేర్కొన్నారు. కేసీఆర్ సభ ఆట్టర్ ప్లాప్ అయిందని… హైదరాబాద్ నుండే టీఆర్ఎస్ పతనం ప్రారంభం అయ్యిందని తెలిపారు. బండి సంజయ్ కి హైదరాబాద్ కి సంబంధం లేదని…. బీజేపీ మంత్రులు అంతా వచ్చారు… కానీ ఒక్కపైస కూడా సిటీ కి ఇప్పించలేదని ఫైర్ అయ్యారు. ఫార్మా హబ్… ఎయిర్ పోర్టు.. కృష్ణా నీళ్లు… గోదావరి నీళ్లు తెచ్చింది కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు ఉత్తమ్. ఢిల్లీ నుండి వచ్చిన వాళ్ళు హైదరాబాద్ కి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని… కానీ పాత బస్తిలో పంచాయతీ పెడుతున్నారని ఆగ్రహించారు. పాత బస్తీలో సర్జికల్ స్ట్రైక్ చేస్తారా..? బుద్ధి ఉందా.. ఏం మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు ఉత్తమ్. బీజేపీ నాయకులు ప్రజల సమస్యలపై మాట్లాడటం లేదని.. Mim అసద్… అమిత్ షా ని కలిసింది నిజం కాదా అని ప్రశ్నించారు ఉత్తమ్.