టిపిసిసి అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు. హుజూర్నగర్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన.. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నల్గొండ నుంచి ఎంపీగా విజయం సాధించారు. దీనితో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా పత్రాన్ని అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యులకు అందజేశారు.
ఈ విషయమై అంతకుముందు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డితో ఉత్తమ్ మాట్లాడారు. ఆ తర్వాత నేరుగా అసెంబ్లీకి వెళ్లి కార్యదర్శికి రాజీనామాను సమర్పించారు.
కేసీఆర్ను గద్దె దింపే బాధ్యత తీసుకున్నాం: రాజగోపాల్రెడ్డి