అమెరికా సైన్యానికి చెందిన బ్యాండ్ భారత జాతీయగీతాన్ని ఆలపించింది. భారత్, అమెరికాల మధ్య రక్షణపరమైన సమన్వయాన్ని బలోపేతం చేసే దిశగా ‘యూధ్ అభ్యాస్ 2019’ పేరుతో సంయుక్త డ్రిల్ను చేపట్టారు. ఇందులో భాగంగా అసోం రెజిమెంటల్ మార్చింగ్ పాట అయిన “బద్లూరామ్ కా బదన్”కు కాలు కదిపిన అమెరికా జవాన్లు తాజాగా భారత జాతీయగీతాన్ని ఆలపించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నేషనల్ ఛానెల్ ఎన్డీటీవీ లో ప్రసారం అయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియోను చూసిన భారతీయులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Video Source: NDTV
ఇండస్ట్రీకి బాలకృష్ణ కింగ్ కాదు , కేవలం హీరోనే… నాగబాబు సంచలన వ్యాఖ్యలు