telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు విద్యా వార్తలు

నేడు ఎన్‌డీఏ రాత పరీక్ష..10 నిమిషాల ముందు చేరుకోవాలి

Inter Ist Year Chemistry paper leake

యూపీఎస్సీ నిర్వహించే నేషనల్ డిఫెన్స్ అకాడమీ(ఎన్‌డీఏ-2019) నేవీ అకాడమీ(ఎన్‌ఏ)లో పలు పోస్టుల భర్తీకి ఆదివారం రాత పరీక్షను నిర్వహించనున్నారు. ఈ పరీక్ష కోసం అధికారులు అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేశారు. పరీక్ష సమయానికి 10 నిమిషాల ముందు పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి. . ఏ మాత్రం ఆలస్యమైనా అనుమతించరు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు రెండు సెషన్లలో పరీక్షను నిర్వహించనున్నారు. 11,628 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకాబోతున్నారు. ఇందుకోసం మొత్తం 24 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.

Related posts