telugu navyamedia
వార్తలు విద్యా వార్తలు సామాజిక

ఈ నెల 12న సివిల్స్ నోటిఫికేషన్: యూపీఎస్సీ

upsc jobs notification for many posts

ఈ నెల 12న సివిల్స్ నోటిఫికేషన్ జారీ చేయనున్నట్టు సోమవారం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ ప్రకటించింది. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ వంటి సివిల్ సర్వీసులకు ఈ ఏడాది ప్రిలిమినరీ పరీక్ష తేదీని ఖరారు చేసింది. దీనికి సంబంధించి యూపీఎస్సీ విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం..12వ తేదీన నోటిఫికేషన్ జారీ అవుతుంది.

మార్చి 3వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవచ్చు.మే 31వ తేదీన సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారు.‘upsconlinenic.in’ వెబ్ సైట్లో దరఖాస్తులు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ విడుదల చేశాక ఈ పోర్టల్ అందుబాటులోకి వస్తుంది.

దరఖాస్తు చేసుకునే వారు డిగ్రీ, లేదా దానితో సమానమైన సర్టిఫికెట్ కోర్సు చేసి ఉండాలి.కనీస అర్హత వయస్సు 21 ఏళ్లు గరిష్టంగా 32 ఏళ్లు.ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్ కేటగిరీల వారికి ఐదేళ్లు మినహాయింపు ఉంటుంది.
ఓబీసీ కేటగిరీ, డిఫెన్స్ సర్వీసులో ఉన్న వాళ్లకు మూడేళ్ల మినహాయింపు ఉంటుంది. వారు 35 ఏళ్ల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
యూపీఎస్సీ నోటిఫికేషన్లో పేర్కొనే తేదీ నాటికి ఈ వయో పరిమితి వర్తిస్తుంది.
జనరల్ అభ్యర్థులు గరిష్టంగా ఆరుసార్లు సివిల్స్ పరీక్ష రాయవచ్చు. ఓబీసీలు గరిష్టంగా 9 సార్లు రాయొచ్చు. ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వారికి నిర్ణీత పరిమితి అంటూ ఏదీ లేదు.

Related posts