ఇటీవల “సీత” చిత్రంతో ప్లాప్ ను తన ఖాతాలో వేసుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రస్తుతం “రాక్షసుడు” అనే చిత్రం చేస్తున్నాడు. ఇటీవల చిత్ర టీజర్ విడుదల కాగా, ఈ టీజర్ ప్రేక్షకులని అలరించింది. ఇక “దొంగాట, కిట్టు ఉన్నాడు జాగ్రత్త” చిత్రాల దర్శకుడు వంశీకృష్ణ దర్శకత్వంలో “టైగర్ నాగేశ్వర్ రావు” బయోపిక్ రూపొందనుండగా ఇందులో టైగర్ నాగేశ్వర్ రావు పాత్రని బెల్లంకొండ చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఆగస్ట్ నుండి ఈ చిత్ర షూటింగ్ మొదలు కానున్నట్టు తెలుస్తుండగా, ఇందులో పాయల్ రాజ్పుత్ని కథానాయికగా ఎంపిక చేసినట్టు సమాచారం. 1980-90 దశకాల్లో స్టూవర్టుపురం గజదొంగగా అందరిని వణికించిన టైగర్ నాగేశ్వర్రావు బయోపిక్ ప్రేక్షకులని తప్పక అలరించనుందని అంటున్నారు
previous post
next post
నా కాపురంలో ఇప్పులు పోశాడు… ఇప్పుడు అతని కళ్లు చల్లబడి ఉంటాయి : సింగర్ ఫైర్