telugu navyamedia
సినిమా వార్తలు

గజదొంగ బయోపిక్ కు ముహూర్తం ఖరారు

Bellamkonda

ఇటీవ‌ల “సీత” చిత్రంతో ప్లాప్ ను తన ఖాతాలో వేసుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్ర‌స్తుతం “రాక్ష‌సుడు” అనే చిత్రం చేస్తున్నాడు. ఇటీవ‌ల చిత్ర టీజ‌ర్ విడుద‌ల కాగా, ఈ టీజ‌ర్ ప్రేక్ష‌కుల‌ని అల‌రించింది. ఇక “దొంగాట, కిట్టు ఉన్నాడు జాగ్రత్త” చిత్రాల దర్శకుడు వంశీకృష్ణ దర్శకత్వంలో “టైగర్ నాగేశ్వర్ రావు” బ‌యోపిక్ రూపొంద‌నుండ‌గా ఇందులో టైగ‌ర్ నాగేశ్వ‌ర్ రావు పాత్రని బెల్లంకొండ చేయ‌బోతున్న‌ట్టు తెలుస్తుంది. ఆగ‌స్ట్ నుండి ఈ చిత్ర షూటింగ్ మొద‌లు కానున్న‌ట్టు తెలుస్తుండ‌గా, ఇందులో పాయ‌ల్ రాజ్‌పుత్‌ని క‌థానాయిక‌గా ఎంపిక చేసిన‌ట్టు స‌మాచారం. 1980-90 దశకాల్లో స్టూవర్టుపురం గజదొంగగా అంద‌రిని వ‌ణికించిన టైగ‌ర్ నాగేశ్వ‌ర్‌రావు బ‌యోపిక్ ప్రేక్ష‌కుల‌ని త‌ప్ప‌క అల‌రించ‌నుంద‌ని అంటున్నారు

Related posts