యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ “సాహో” టీజర్ కొద్ది నిమిషాల క్రితం విడుదలైన విషయం తెలిసిందే. ఈ టీజర్లో ప్రభాస్ చేస్తున్న స్టంట్స్ , యాక్షన్ సీన్స్ సామాన్య జనాలనే కాక సెలబ్రిటీలని కూడా ఆకట్టుకుంటున్నాయి. 150 కోట్ల బడ్జెట్తో సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో శ్రద్ధా కపూర్ కథానాయికగా నటిస్తుంది. నీల్ నితిన్ ముఖేశ్ ప్రతినాయకుడి పాత్రను పోషిస్తున్నారు. ఎవ్లిన్ శర్మ, మురళీ శర్మ, జాకీ ష్రాఫ్, మందిరా బేడీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతం చిత్ర చివరి షెడ్యూల్ జరుగుతుండగా, ఆగస్ట్ 15న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారు. హాలీవుడ్ రేంజ్లో రూపొందుతున్న ఈ చిత్ర టీజర్ ఇటీవలే విడుదల కాగా… సినీ ప్రముఖులందరూ టీజర్ పై ప్రశంసలు వర్షం కురిపించారు. ఈ చిత్ర టాకీ పార్ట్ దాదాపు పూర్తికాగా… ప్రస్తుతం ఆస్ట్రియాలో పాటల చిత్రీకరణ జరుగుతుంది. అక్కడ ప్రభాస్, శ్రద్ధాలపై సాంగ్స్ చిత్రీకరిస్తున్నారు. చిత్రబృందంతో కలిసి ప్రభాస్ కేబుల్ రైడ్ చేస్తున్న ఫొటోలను శ్రద్ధా కపూర్ హెయిర్ స్టయిలిస్ట్ నికితా మేనన్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. దాదాపు ఈ నెలాఖరుకి చిత్ర షూటింగ్ అంతా పూర్తి చేసి ఆ తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలని వేగవంతం చేయనున్నారు.
previous post
next post
టీడీపీ అధికారంలోకి వస్తే హైద్రాబాద్ కంటే అభివృద్ధి: నటి దివ్యవాణి