telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

అఖిల్ సినిమా నుండి వస్తున్న అప్డేట్ ఏంటి..?

అక్కినేని యువ హీరోల్లో అఖిల్ అక్కినేని ఒకరు. అతడు ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. అఖిల్ ఇటీవల మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో బుట్టబొమ్మ పూజ హెగ్దె హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమా ఇంకా విడుదల కాలేదు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే అఖిల్ ఈ సినిమా చిత్రీకరణలో ఉండగానే మరో దర్శకడు సురేంధర్ రెడ్డికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అఖిల్, సురేంధర్ కాంబోలో స్పై థ్రిల్లర్ రానుందని అప్పట్లో అనేక వార్తలు వచ్చాయి. ఇప్పటికీ ఈ సినిమా ప్లాట్ విషయంలో క్లారీటీ లేదు. ఇక ఇదిలా ఉంటె ఈ సినిమా త్వరలో ఓ అప్డేట్ ఇవ్వనున్నారు. ఈ చిత్రాన్ని నిర్మాణం వహిస్తున్న ఏకె ఎంటర్టైన్మెంట్స్ వారు ట్విట్టర్ వేదిక ఈ విషయాన్ని ప్రకటించారు. అయితే ఆ రానున్న అప్డేట్ ఏంటి అనేది తెలియదు.ఇదిలా ఉంటే అఖిల్ ఈ సినిమా కోసం గుర్రపు స్వారీలో కూడా శిక్షణ తీసుకున్నారు. ఈ శిక్షణకు సంబంధించిన వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ కూడా అయింది. ఈ సినిమాను మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నారంట.

Related posts