మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో పాల్గొనడంతో పాటు ఇన్వెస్ట్ తెలంగాణ డెస్క్కు కోఆర్టినేటర్గా పని చేశారు. నిన్న దావోస్ లో తెలంగాణ స్టాల్ రిసెప్షన్ లో కూర్చుని తాను దిగిన ఫొటోను ట్వీట్ చేస్తూ, “కేటీఆర్ గారు…నా జాబ్ ఎలా ఉంది” అని అని అడిగింది. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై దీనికి స్పందించిన కేటీఆర్ ధన్యవాదాలు ఉపాసన. మా టీం స్థైర్యాన్ని పెంచినందుకు ఆనందంగా ఉందని రిప్లయ్ ఇచ్చారు.
ఇప్పుడు ఈ ట్వీట్ కూడా వైరల్ అవుతోంది. తెలంగాణలో పెట్టుబడులు పెట్టే కంపెనీలకు ఆమె సమాచారం అందించారు. అంతేకాదు తెలంగాణలో పెట్టుబడులకు ఎలాంటి అనుకూల పరిస్థితులు ఉన్నాయో ఆమె ఇన్వెస్టర్ లకు వివరించారు. ఈ విషయాలని కేటీఆర్కి ట్విట్టర్ ద్వారా తెలియజేస్తూ.. డెస్క్లో పని చేసిన ఫోటోలని కూడా ఉపాసన పోస్ట్ చేసింది.