రామ్ చరణ్ సతీమణి ఉపాసన సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉంటారు. రామ్ చరణ్ సినిమా విశేషాలను, ఆయన డైట్ విషయాలను ఉపాసన అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటారు. అయితే తాజాగా ఉపాసన చెప్పిన శుభవార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాంచరణ్, ఉపాసనకు గుర్రాలంటే ఎంతో ఇష్టం. ఆడ గుర్రం ఫిల్లీని వాళ్లు ఎంతో ఇష్టంగా పెంచుకుంటున్నారు. ఇప్పుడు ఆ ఫిల్లీకి పిల్ల పుట్టింది. అది చాలా అందంగా ఉందంటూ ట్విట్టర్లో ట్వీట్ పెట్టింది ఉపాసన. తల్లి గుర్రంతో ఉన్న పిల్ల గుర్రం ఉన్న ఫొటోను పోస్ట్ చేసింది. అంతేకాదు అది పుట్టిన వేళా విశేషం బాగుందనీ, తాము ఎంతో సంతోషంగా ఉన్నామనీ, పిల్ల గుర్రం ఆరోగ్యంగా ఉందనీ తెలిపింది. దానికి ఏదైనా పేరు పెట్టమని నెటిజన్లు, అభిమానులను సలహాలు, సూచనలూ కోరింది. ఈ శుభవార్తతో మెగా ఫ్యామిలీ ఇప్పుడు ఎంతో ఆనందంగా ఉంది. ఉపాసన పెట్టిన ఫొటోకు తెగ లైక్స్ వస్తున్నాయి. చాలా మంది ఆ పిల్ల గుర్రానికి ఏ పేరు పెట్టాలనే దానిపై రకరకాల పేర్లను సూచిస్తున్నారు.
Blessed with filly ( female foal ). Need to name her soon. Any suggestions ?
She’s adorable. 😘🥰❤️ #supersaturday pic.twitter.com/tVycD9HGKv— Upasana Konidela (@upasanakonidela) 27 July 2019
యాంకర్ ప్రదీప్ కు ఆ హీరోయిన్ తో ఎఫైర్… దర్శకుడి సంచలన వ్యాఖ్యలు