దేశవ్యాప్తంగా ఏ వేడుక జరిగినా అందులో బాలీవుడ్ స్టార్స్ కే ఎక్కువ ప్రాధాన్యతనిస్తుంటారు. సౌత్ లో ఎంతోమంది స్టార్స్ ఉన్నా వారికి కనీసం ఆహ్వానం కూడా అందదు. సౌత్ స్టార్స్ ను ఇలా నిర్లక్ష్యం చేయడం బాధను కలిగిస్తోందంటూ మెగా పవర్ స్టార్ ఉపాసన కామినేని ట్వీట్ చేశారు. అంతేకాదు సౌత్ స్టార్స్ ను ఎందుకు ఇలా ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారంటూ ఆమె సూటిగా మోడీనే ప్రశ్నించారు. హాత్మ గాంధీ 150వ జయంత్యుత్సవాలకి సంబంధించిన కార్యక్రమాల గురించి చర్చించడానికి ప్రధాని మోదీ బాలీవుడ్ స్టార్స్ అమీర్ ఖాన్, షారూఖ్ ఖాన్, బోనీ కపూర్, రకుల్లతో పాటు పలువురు ప్రముఖులని తన ఇంటికి ఆహ్వానించిన సంగతి తెలిసిందే. అయితే దక్షిణాది నుండి దిల్ రాజు మినహా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ పరిశ్రమల నుండి ఏ సెలబ్రిటీకి ఆహ్వానం అందలేదు. దీనిపై రామ్ చరణ్ సతీమణి ఉపాసన ట్విట్టర్ వేదికగా మోదీని ప్రశ్నించింది. దక్షిణాదిన మీరంటే మాకు ఎంతో గౌరవం. మీరు ప్రధానిగా ఉండటం పట్ల మేము గర్విస్తున్నాయి. గొప్ప కార్యక్రమాలు చేపట్టినప్పుడు వాటిలో హిందీ ఆర్టిస్టులనే ఎక్కువ భాగం పరిమితం చేస్తున్నారు. దక్షిణాది నటులని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. చాలా బాధతో నా మనసులో భావాన్ని మీకు వ్యక్తపరుస్తున్నాను అని ఉపాసన.. మోదీకి ట్వీట్ చేసింది. చిత్ర పరిశ్రమకు దక్షిణాది పరిశ్రమలు ఎంతో విశిష్టమైన సేవలు అందిస్తుండగా, మోదీ మనల్ని భాగం చేయకపోవడం ముమ్మాటికి తప్పే అని ఉపాసనని సమర్ధిస్తూ మాట్లాడుతున్నారు నెటిజన్స్.
Jai Hind @narendramodi ji. 🙏🏻 pic.twitter.com/11olAv1tsV
— Upasana Konidela (@upasanakonidela) 19 October 2019