telugu navyamedia
రాజకీయ వార్తలు

రిజర్వేషన్ల విషయంలో.. యూపీ సర్కార్‌ కు కేంద్రం షాక్

Mamatha Break Yogi Rali West Bengal

2017లో 17 ఓబీసీ కులాలను ష్కెడూల్డ్ క్యాస్టులలో చేరుస్తూ యూపీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. .అప్పట్లో ఇది పెద్ద సంచలనమైంది. ఈ విశ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్రం షాకిచ్చింది. రాజ్యాంగానికి విరుద్ధంగా 17 ఓబీసీ కులాలను ఎస్సీల్లో చేర్చడాన్ని తప్పుబట్టింది. యూపీ ప్రభుత్వ చర్యలు రాజ్యాంగ విరుద్ధమని తేల్చి చెప్పింది.

రాజ్యసభలో అడిగిన ఓ ప్రశ్నకు సామాజికన్యాయ శాఖ మంత్రి తవార్ చంద్ గెహ్లాట్ సమాధానమిస్తూ.. రాజ్యాంగపరమైన విధివిధానాలు పాటించకుండా యూపీ ప్రభుత్వం ఓబీసీలను ఎస్సీల్లో కలిపేసిందని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన అభ్యర్థనకు పార్లమెంట్ ఆమోదం పలికిన తర్వాతే అది రాజ్యాంగబద్ధమవుతుందని ఆయన అన్నారు.

Related posts