telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

దాడికి పాల్పడ్డ తబ్లిగీ సభ్యులపై యూపీ సీఎం ఫైర్

yogi adityanath

ఇటీవల ఢిల్లీలో తబ్లిగీ జమాత్ సంస్థ నిర్వహించిన మత సమ్మేళనానికి దేశవ్యాప్తంగా వందల మంది హాజరయ్యారు. వారిలో కొందరు కరోనా బారినపడడంతో మరికొందరిని ముందు జాగ్రత్తగా అధికారులు క్వారంటైన్ కు తరలించారు. ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రంలో తబ్లిగీ సభ్యులు వైద్యసిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడి ఘటనను యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్రంగా ఖండించారు.

వైద్యసిబ్బందిపై దాడి చేసినవాళ్లను “మానవాళికి శత్రువులు”గా అభివర్ణించారు. వారిపై జాతీయ భద్రతా చట్టం (ఎన్ఎస్ఏ) కింద కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. “వారు చట్టాన్ని గౌరవించరు, ప్రభుత్వ ఆదేశాలను అంతకన్నా పాటించరు. ఇలాంటివాళ్లతో మనుషులకు ముప్పు ఉంటుంది. మహిళా వైద్య సిబ్బందిపై వారు దాడికి పాల్పడడం తీవ్ర నేరమని పేర్కొన్నారు. వారిని వదిలిపెట్టేది లేదు” అంటూ మండిపడ్డారు.

Related posts