telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

కరోనా వల్ల భారత్‌లో 40 కోట్ల మందికి పేదరికం: ఐక్యరాజ్యసమితి

karona virus

కరోనా వైరస్‌ ఇప్పటికే భారత్‌ సహా ప్రపంచంలోని అన్ని దేశాలను ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేసింది. కోవిడ్-19 వ్యాప్తి వల్ల భారత్‌లో కూలి పనులు, చిరు వ్యాపారస్థులు కటిక పేదరికంలోకి వెళ్తారని ఐక్యరాజ్యసమతి కార్మిక సంస్థ హెచ్చరించింది. అనధికారిక ఆర్థిక రంగంలో పని చేస్తున్న దాదాపు 40 కోట్ల మంది (400 మిలియన్లు) కటిక పేదరికంలోకి వెళ్ళే అవకాశం ఉందని తెలిపింది. కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా 195 మిలియన్‌ ఉద్యోగాలు పోనున్నాయని ఓ నివేదికలో తెలిపింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తలెత్తుతున్న అత్యంత సంక్షోభ ఆర్థిక పరిస్థితులను కరోనా వల్ల చూడబోతున్నట్లు చెప్పింది.

భారత్, నైజీరియా, బ్రెజిల్ వంటి దేశాల్లో అధిక సంఖ్యలో అనధికార, అసంఘటిత రంగంలోని కార్మికులపై ఈ ప్రభావం పడుతుంది. భారత్‌లో 90 శాతం మంది ప్రజలు అనధికార ఆర్థిక రంగంలోనే పనిచేస్తున్నారు. వారంతా కటిక పేదరికాన్ని ఎదుర్కొనే అవకాశముంది. భారత్‌లో లాక్‌డౌన్‌ కారణంగా కార్మికులపై ఈ ప్రభావం పడుతుంది. కరోనా తిరిగి వారిని గ్రామీణ ప్రాంతాలకు వెళ్లేలా చేస్తోంది’ అని నివేదికలో తెలిపింది.

అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాల్లో కార్మికులు, వ్యాపారాలు తీవ్ర సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ప్రపంచంలో 1.25 బిలియన్ల మంది కార్మికులు, ఉద్యోగులు హైరిస్క్‌లో ఉన్నారని, వారిని సంస్థలు తొలగించే అవకాశం లేక వేతనాల్లో కోత విధించే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడింది. తక్కువ వేతనం వచ్చే ఉద్యోగాలు, పనికి తక్కువ నైపుణ్యాలు అవసరం ఉన్న ఉద్యోగాలను ఒక్కసారిగా కోల్పోయే అవకాశం ఉందని తెలిపింది.

Related posts