హైదరాబాద్ మెట్రోలో మరో సదుపాయం ప్రారంభించారు. ప్రయాణికుల సౌకర్యార్థం స్టేషన్ లోనే క్యాంటీన్ ను ఏర్పాటు చేశారు. దీనిలో కేవలం రూ.50 చెల్లిస్తే ఇష్టం వచ్చినన్ని.. ఇడ్లీలు, దోశలు, పొంగల్ను అల్పాహారంగా తినొచ్చు; అలాగే కేవలం రూ.100 ఎంతైనా భోజనం చేయవచ్చు. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా ఒక స్టేషన్ లో ఏర్పాటు చేసిన ఈ సదుపాయం త్వరలో అన్ని స్టేషన్ లలో అందుబాటులోకి రానుంది.
ప్రాధమికంగా హైదరాబాద్ ఎల్బీనగర్ మెట్రోస్టేషన్లో.. అయ్యంగార్ ఇడ్లీదోశ క్యాంటీన్ అందుబాటులోకి వచ్చింది. ఈ క్యాంటీన్ను మెట్రో రైలు అధికారి అనిల్కుమార్ షైనీ, తదితరులు ప్రారంభించారు. ఇక నుండి స్టేషన్ లోనే తిండీతిప్పలు, రైలు కోసం వేచి చూసే సమయంలో కానిచ్చేయోచ్చు. త్వరలో చిరుతిండి కూడా అందుబాటులోకి తేనున్నారు.
ఒవైసీకి కేసీఆర్ భయపడుతున్నారు: అమిత్ షా