telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ

హైదరాబాద్ మెట్రో స్టేషన్ లో క్యాంటీన్ .. 100 చెల్లిస్తే అన్ లిమిటెడ్ ఆహారం..

hightech city metro by this month last week
హైదరాబాద్ మెట్రోలో మరో సదుపాయం ప్రారంభించారు. ప్రయాణికుల సౌకర్యార్థం స్టేషన్ లోనే క్యాంటీన్ ను ఏర్పాటు చేశారు. దీనిలో కేవలం రూ.50 చెల్లిస్తే ఇష్టం వచ్చినన్ని.. ఇడ్లీలు, దోశలు, పొంగల్‌ను అల్పాహారంగా తినొచ్చు; అలాగే కేవలం రూ.100 ఎంతైనా భోజనం చేయవచ్చు. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా ఒక స్టేషన్ లో ఏర్పాటు చేసిన ఈ సదుపాయం త్వరలో అన్ని స్టేషన్ లలో అందుబాటులోకి రానుంది. 
ప్రాధమికంగా హైదరాబాద్‌ ఎల్బీనగర్ మెట్రోస్టేషన్‌లో.. అయ్యంగార్ ఇడ్లీదోశ క్యాంటీన్ అందుబాటులోకి వచ్చింది. ఈ క్యాంటీన్‌ను మెట్రో రైలు అధికారి అనిల్‌కుమార్ షైనీ, తదితరులు ప్రారంభించారు. ఇక నుండి స్టేషన్ లోనే తిండీతిప్పలు, రైలు కోసం వేచి చూసే సమయంలో కానిచ్చేయోచ్చు. త్వరలో చిరుతిండి కూడా అందుబాటులోకి తేనున్నారు.

Related posts