ఏపీలో వైసీపీ, టీడీపీ మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్నవిషయం తెలిసిందే. అయితే ఇది రోజుకో రంగు పులుముకుంటూ.. విచిత్ర చేష్టలకు దారితీస్తుంది. తాజాగా, 13వ వార్డులోని చెక్కవంతెన దగ్గర ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి ఆకతాయిలు బొట్టుపెట్టారు. నామాలు దిద్ది, మీసాలు పెట్టారు. ఇది గమనించిన స్థానికులు ఆకతాయిల చర్యలపై మండిపడుతున్నారు. ఆకతాయిలను పట్టుకుని, వారిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత టీడీపీ సంబంధిత విగ్రహాలు, ఆర్చీలు, బల్లలు ధ్వంసం చేయడం పరిపాటిగా మారింది. టీడీపీ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఏర్పాటు చేసిన బల్లలు, నేమ్ బోర్డులు పగులగొట్టడం, శిలాఫలకాలు ద్వంసం చేయడం జరుగుతోంది. తాజాగా గత రాత్రి దివంగత నేత ఎన్టీఆర్ విగ్రహానికి నల్ల రంగుతో నామాలు, బొట్టు, మీసాలు పెట్టి.. అవమానపరిచారు.