telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ రాజకీయ

గుంటూరు లో ఎన్టీఆర్ విగ్రహాల ధ్వంసం.. దుండగుల కోసం పోలీసుల గాలింపు..

unknown collapsing ntr statues in guntur

ఏపీలో రాజకీయం కొత్త పుంతలు తొక్కుతుంది. తాజాగా, గుంటూరు జిల్లాలో గుర్తుతెలియని దుండగులు రెచ్చిపోయారు. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ విగ్రహాలకు నిప్పుపెట్టడం వంటి విధ్వంసాలకు పాల్పడ్డారు. దీనితో జిల్లాలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నిన్న రాత్రి ఎవ్వరూ లేని సమయంలో కొందరు దుండగులు స్తంభాలగరువు, నెహ్రూ నగర్, ఏటుకూరు రోడ్డు ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాలకు నిప్పు పెట్టారు. పెట్రోల్ లో ముంచిన వస్త్రాలను విగ్రహంపై వేసి మంట పెట్టారు.

నెహ్రూనగర్ లో ఎన్టీఆర్ విగ్రహం తలను ఆకతాయిలు ధ్వంసం చేశారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు అక్కడకు చేరుకుని ఆందోళనకు దిగారు. బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు టీడీపీ నేతలను సముదాయించారు. బాధ్యులను వీలైనంత త్వరగా అరెస్ట్ చేస్తామని హామీ ఇచ్చారు. ఆందోళనను విరమించిన టీడీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదును అందజేశారు.

Related posts