telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

కరోనా వ్యాక్సిన్ తీసుకున్న కేంద్రమంత్రి…

kishanreddy on ap capital

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇవాళ కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్నారు. ఆయనకు కోవిషిల్డ్ వ్యాక్సిన్ ఇచ్చారు గాంధీ ఆస్పత్రి వైద్యులు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాని కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారని.. 60 సంవత్సరాలు దాటిన ప్రతి వ్యక్తి కి, 45 ఏళ్ళు దాటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారికి టీకా ఇస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ సెంటర్ లలో కోవిడ్ వ్యాక్సిన్ ఉచితమని.. ప్రైవేట్ లో 250 రూపాయల కన్నా ఒక్క రూపాయి కూడా ఎక్కువ ఇవ్వొద్దని స్పష్టం చేశారు. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు మాత్రమే వసూలు చేయాలని ప్రైవేట్ ఆస్పత్రులకు వారికి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం 10 వేల ఫ్రీ వాక్సినేషన్ సెంటర్లు ఉన్నాయని… వాటిని 20 వేలకు పెంచుతామని పేర్కొన్నారు. తెలంగాణలో 91 కేంద్రాల్లో వాక్సినేషన్ కేంద్రాలు ఉన్నాయని.. ఇందులో ప్రభుత్వ కేంద్రాలు 45 ఉన్నాయని తెలిపారు. అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తారు కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి. ప్రధాని తీసుకున్నాడు.. ఈటెల రాజేందర్ తీసుకున్నాడు… ఎవరు భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు. ఆరోగ్య భారత్ నిర్మాణం కావల్సి ఉందని… వ్యాక్సిన్ తీసుకున్న కరోనా నిబంధనలు పాటించాలని కోరారు.

Related posts