telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

దుబ్బాక లో ఎగిరేది కాషాయ జెండానే..

దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారంలో ఇవాళ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన టీఆర్ఎస్ పార్టీపై ఫైర్ అయ్యారు. దుబ్బాక ప్రజలు మార్పు కోరుకుంటున్నారని.. బీజేపీ విజయం ఖాయమన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తాను తెలంగాణ కోసం అనేక ఉద్యమాలు చేసానని..అందులో టీఆర్ఎస్ నాయకులూ కూడా పాల్గొన్నారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమం విషయంలో నాకు ఎవరి సర్టిఫికెట్ అవసరం లేదన్నారు. కేంద్ర నిధులు విషయంలో టీఆర్ఎస్ వాస్తవాలకి విరుద్ధంగా మాట్లాడుతుందని..కాంగ్రెస్, టీఆర్ఎస్ లు ఒకటే, కాంగ్రెస్ కి ఓటు వేస్తే ఎటువంటి ఉపయోగం లేదని సూచించారు. అధికార దుర్వినియోగంతో టీఆర్ఎస్ గెలవాలని చూస్తుందని ఫైర్ అయ్యారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి . టీఆర్ఎస్ ప్రజలను మభ్య పెట్టి, లబ్ది పెట్టి గెలవాలని చూస్తుందని ఆరోపించారు. దుబ్బాక లో ఎటువంటి అభివృద్ధి జరగలేదని..దుబ్బాక లో ఎగిరేది కాషాయ జెండా అని స్పష్టం చేశారు  కిషన్ రెడ్డి .

Related posts