telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

బూకర్ ప్రైజ్ .. ఈసారి ఇద్దర్ని వరించింది..

two women got booker prize this year

ఆంగ్ల సాహిత్య పురస్కారాలతో అత్యున్నతమైన బూకర్ ప్రైజ్ ఈసారి ఇద్దర్ని వరించింది. మార్గరెట్ ఆట్‌వుడ్‌, బెర్నార్డినీ ఎవరిస్టోలకు ఈ యేటి బూకర్ పురస్కారాన్ని పంచుకున్నారు. ఫిక్షన్ క్యాటగిరీలో ఇద్దరు రచయితలకు బూకర్ ప్రైజ్‌ను ప్రకటించడం ఇదే మొదటిసారి. లండన్‌లో జరిగిన ఈవెంట్‌లో ఇద్దరూ ఆ అవార్డును అందుకున్నారు. ఆట్‌వుడ్ రాసిన ద టెస్టామెంట్స్‌, ఎవరిస్టో రాసిన గర్ల్‌, వుమెన్‌, అదర్ నవలలకు ఈ అవార్డులు దక్కాయి.

ఈ ఇద్దరూ 50వేల పౌండ్ల ప్రైజ్‌మనీ పంచుకుంటారు. 79 ఏళ్ల వయసులో ఆట్‌వుడ్ బూకర్ గెలుచుకోగా.. తొలిసారి ఈ అవార్డును గెలుచుకున్న నల్లజాతి మహిళగా ఎవరిస్టో నిలిచింది. వాస్తవానికి ప్రతి ఏడాది బూకర్ ప్రైజ్‌ను ఒక్కరికి మాత్రమే ప్రకటిస్తారు. కానీ ఈసారి ప్యానల్ జడ్జీలు బహుమతిని ఇద్దరికీ పంచేందుకు నిర్ణయించారు.

Related posts