దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల్లో మూడో విడుత పోరుకు ఓటింగ్ కొనసాగుతోంది. 13 రాష్ట్రాలు , 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 117 లోక్సభ నియోజకవర్గాలకు ఈ రోజు పోలింగ్ జరుగుతుంది. కాగా కేరళ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్లో ఓటేసేందుకు వచ్చిన ఇద్దరు వయో వృద్ధులు మృతిచెందారు. పతనంతిట్ట ప్రాంతంలో పోలింగ్ బూత్కు వచ్చి ఓటేసిన అనంతరం 77 ఏండ్ల వృద్ధుడు ఒక్కసారిగా కుప్పకూలి చనిపోయాడు. అదేవిధంగా మరోక ఘటనలో వదకర నియోజకవర్గంలోని చోక్లీలో ఓటేసేందుకు వచ్చి ఓ వృద్ధురాలు మృతిచెందింది.
previous post
జైలులో చిప్ప కూడు తినే వాళ్ళకు సీఎం పదవి..