telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సామాజిక

విద్యార్థుల మృతి ఘటన పై సీరియస్.. ఇద్దరు ఉపాధ్యాయులు సస్పెన్షన్

తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో ని నాగారం ఏజీ క్వాటర్స్‌లో ఉన్న ఉర్ధూమీడియం పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు కుంటలో పడి మృతి చెందిన సంగతి తెలిసిందే. మూడో తరగతి చదువుతున్న అజార్, అర్బాజ్‌ఖన్, నాలుగో తరగతి చదువుతున్న సలీ మృతి చెందారు.

విద్యార్థుల మృతి ఘటనలో విద్యాశాఖ చర్యలు చేపట్టింది. విద్యా వాలంటీర్ జలీల్‌ను విధుల నుంచి తొలగించారు.హెడ్ మాస్టర్ సిరాజ్, ఉపాధ్యాయుడు అజీజ్‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పాఠశాల నుంచి బయటకు వెళ్లిన విద్యార్థుల విషయం పట్టించుకోనందుకు చర్యలు తీసుకున్నట్టు పేర్కొన్నారు.

Related posts