గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో దారుణం జరిగింది. ఆస్తి తగాదాల నేపథ్యంలో ఇద్దరు పిల్లలను చంపి ఓ తండ్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన గ్రామంలో విషాదాన్ని నింపింది. ఇంట్లో భార్య లేని సమయంలో రమణమూర్తి అనే వ్యక్తి నాగ దినేష్(7), సాయి(6) అనే తన ఇద్దరు పిల్లలను గురువారం ఉదయం గొంతుకోసి హత్యచేసి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ సంఘటన జరిగిందని తెలుస్తోంది. సమాచారమందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.