telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సింగర్స్ సునీత, మాళవికకు కరోనా

Sunitha

ఇటీవల కాలంలో పలువురు సినీ ప్రముఖులు ఎక్కువగా కరోనా బారిన పడుతున్నారు. సినీ పరిశ్రమ నుంచి బండ్ల గణేష్, రాజమౌళి, డీవీవీ దానయ్య, తేజ, నాగవంశీ మరికొంత మంది ప్రముఖులు కరోనా బారిన పడి కోలుకున్నారు. తాజాగా ప్రముఖ గాయనీమణులు సునీత, మాళవిక కరోనా బారిన పడ్డారు. పరీక్షల్లో వీరిద్దరికీ కరోనా పాజిటివ్ వచ్చినట్టు ఇండస్ట్రీ వర్గాల ద్వారా తెలిసింది. ఓ టీవీ ఛానెల్ కోసం రూపొందించిన సంగీత కార్యక్రమంలో పాల్గొన్న వీరిద్దరికీ కరోనా సోకిందట. వీరితో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్న చాలా మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్టు సమాచారం. ఈ ఇద్దరు సింగర్లు ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్నట్టు తెలిసింది. ఇంట్లోనే ఉంటూ వైద్యుల సూచన ప్రకారం జాగ్రత్తలు తీసుకుంటున్నారట.

Related posts