telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

సరిలేరు నీకెవ్వరు లో … సర్ప్రైస్ లు ఎన్నో తెలుసా..

Sarileru-Neekevvaru

నటుడు మహేష్ బాబు తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు. మహేష్ బాబు తన కెరీర్ లో తొలిసారి అజయ్ కృష్ణ అనే మిలిటరీ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ సినిమాలో సీనియర్ నటి విజయశాంతి ఒక కీలక పాత్రలో నటిస్తుండగా బండ్ల గణేష్ మంచి కామెడీ రోల్ లో నటిస్తున్నారు. యువ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాను మహేష్, అనిల్ సుంకర, దిల్ రాజు ముగ్గురూ కలిసి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే యాభై శాతానికి పైగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాకు సంబంధించి నేడు ఒక వార్త టాలీవుడ్ వర్గాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది.

ఈ సినిమాలో ఒక ప్రత్యేక గీతం ఉందని, సినిమా ప్రారంభ సమయంలో దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ చెప్పడం జరిగింది. ఆ గీతంలో ఎవరు నటిస్తారు అనే దానిపై కొద్దిరోజలుగా పలు వార్తలు ప్రచారం అవుతుండగా, దాని పై నేడు మరొక వార్త వైరల్ అవుతోంది. అదేమిటంటే, ఆ ప్రత్యేక గీతంలో ఇటీవల మహేష్ తో కలిసి మహర్షి సినిమాలో జోడి కట్టిన పూజ హెగ్డే నటించనుందని, అలానే ఈ సినిమాలో హీరో ఇంట్రడక్షన్ సాంగ్ లో మరొక సర్ప్రైజ్ ఉందని, అదేమిటంటే, ఆ సాంగ్ లో మిల్కి బ్యూటీ తమన్నా మహేష్ తో కలిసి నటించనున్నట్లు సమాచారం. మరి దీనిని బట్టి చూస్తుంటే, సరిలేరు నీకెవ్వరు సినిమాలో ఏకంగా రెండు సర్ప్రైజ్ లు ఉండనున్నట్లు తెలుస్తోంది.

దీనిపై ఆ సినిమా యూనిట్ నుండి అధికారిక ప్రకటన మాత్రం వెలువడవలసి ఉంది. రత్నవేలు ఫోటోగ్రఫీ ని అందిస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఇటీవల హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీ లో నాలుగున్నర కోట్ల రూపాయలు ఖర్చు చేసి కర్నూలు లోని కొండారెడ్డి బురుజు మాదిరి సెట్టింగ్ ని నిర్మించడం జరిగింది. గత కొద్దిరోజులుగా సరిలేరు యూనిట్, ఇదే సెట్ లో షూటింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఇప్పటికే ఎన్నో అంచనాలు ఏర్పరచుకున్న ఈ సినిమా, రేపు సంక్రాంతికి రిలీజ్ అయిన తరువాత ఎంత మేర రికార్డులు బద్దలు కొడుతుందో చూడాలి.

Related posts