వాయవ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. గుజరాత్ నుంచి ఆవర్తనం వరకు ద్రోణి విస్తరించడంతో కోస్తాలో ఎడతెరిపి వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి రుతుపవనాలు చురుగ్గా మారడంతో రానున్న మూడు రోజుల్లో కోస్తాలో విస్తారంగా, రాయలసీమలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న 48 గంటల్లో ఈశాన్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి ఆ తరువాత బలపడుతుందని పేర్కొంది.
నిన్న (శనివారం) సాయంత్రం వరకు శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళిలో 6.5, విశాఖపట్నం జిల్లా ముంచంగిపుట్టులో 6, అనంతగిరిలో 5 సెంటీమీటలర్ల వర్షపాతం నమోదైంది. సముద్రం అల్లకల్లోలంగా ఉండి అలలు ఎగసిపడుతుండడంతో కళింగపట్నం, భీమునిపట్నం, విశాఖపట్టణం, గంగవరం, కాకినాడ ఓడరేవుల్లో మూడో నంబరు ప్రమాద హెచ్చరిక ఎగురవేశారు.