ఎగువ ప్రాంతాలలో అల్ప పీడన ప్రభావంతో తెలంగాణలో నేడు, రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా కొన్ని రోజులుగా తిరుమలలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి.
పశ్చిమ మధ్య బంగాళాఖాతం, వాయవ్య బంగాళాఖాతంలో 1.5 కిలోమీటర్ల నుంచి 4.5 కిలోమీటర్ల మధ్య ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. మరోవైపు, తెలంగాణ వ్యాప్తంగా నిన్న సాయంత్రం నుంచి రాత్రి వరకు అక్కడక్కడ తేలికపాటి వర్షం కురిసింది.