telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

కాళేశ్వరం పనుల్లో..ఇద్దరు కూలీలు మృతి

Two labour dies kaleshwaram project work

తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మక చేపడుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో పనిచేస్తున్న ఇద్దరు ఉత్తరాది కూలీలు ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళితే కాళేశ్వరం ప్రాజెక్టు 9వ ప్యాకేజీ పనులు చరవేగంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సొరంగం నిర్మాణం జరుగుతోంది. ఈ పనుల్లో ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన కూలీలు కూడా పనిచేస్తున్నారు.

మంగళవారం రాత్రి ఈ సొరంగంలో పని చేసేందుకు సుకేందర్ సింగ్, చందన్ రాయ్ అనే ఇద్దరు కూలీలు వెళ్లారు. అర్థరాత్రి సమయంలో పని ముగించుకుని అక్కడే పడుకున్నారు. ఈ సమయంలో సొరంగంలోకి వచ్చిన ఓ టిప్పర్ పడుకున్న వీరిద్దరిపై నుండి దూసుకెళ్లింది. దీంతో వారిద్దరు సంఘటనా స్థలంలోనే మృతిచెందారు. చీకట్లో వీరిని టిప్పర్ డ్రైవర్ గమనించకపోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related posts