telugu navyamedia
క్రైమ్ వార్తలు

అగ్నిప్రమాదంలో రెండు బోట్లు దగ్దం

fire accident in mojanjahi market hyd
తూర్పుగోదావరి జిల్లాలోని  బోట్ల తయారీ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో రెండు బోట్లు దగ్ధమయ్యాయి.బుధవారం తెల్లవారుజామున ఈ అగ్నిప్రమాదం జరిగింది. జిల్లాలోని యు కొత్తపల్లి మండలంలోని మూలపేట శివారు రామన్నపాలెం బ్రిడ్జి సమీపంలో బోట్ల తయారీ కేంద్రంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. 
ఈ ప్రమాదంలో రెండు బోట్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. వీటితో పాటు కొంత సామాగ్రి కూడా కాలిపోయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోనికి తీసుకువచ్చింది. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
 

Related posts