భారీ వర్షం కారణంగా విమానం రన్వేను ఢీకొనడంతో ముగ్గురు ప్రయాణికులు మృతి చెందారు. 179 మంది గాయపడ్డారు. ఈ ఘటన టర్కీష్లోని ఇస్తాంబుల్ ఎయిర్పోర్టులో జరిగింది. బలమైన గాలులు, భారీ వర్షం కారణంగా విమానం రన్వేను ఢీకొనడంతో.. మూడు ముక్కలైంది. పెగాసస్ ఎయిర్లైన్స్కు చెందిన బోయింగ్ 737 విమానం ఇజ్మీర్ నుంచి ఇస్తాంబుల్లోని సబీహా గోక్సెన్ ఎయిర్పోర్టుకు బయల్దేరింది. గోక్సెన్ ఎయిర్పోర్టులో ల్యాండ్ అవుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.
ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 177 మంది ప్రయాణికులు, ఆరుగురు విమాన సిబ్బంది ఉన్నట్లు ఇస్తాంబుల్ అధికారులు తెలిపారు. ప్రయాణికుల్లో 12 మంది చిన్నారులు ఉన్నారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు ఇస్తాంబుల్ గవర్నర్ అలీ యెర్లీకాయా తెలిపారు.