telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు సామాజిక

ఏపీలో 11 జిల్లాలో హాట్ స్పాట్ లు.. టీటీడీ కీలక నిర్ణయం!

ttd plans to venkanna temples in mumbai and j & K

కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా వచ్చే నెల 3 వరకు లాక్ డౌన్ ను పొడగించిన సంగతి తెలిసిందే. కరోనా వైరస్ చాపాకింద నీరులా విస్తరిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లోని 11 జిల్లాలను కేంద్ర ప్రభుత్వం హాట్ స్పాట్ లుగా గుర్తించింది. ఈ నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. మే 3వ తేదీ వరకు శ్రీవేంకటేశ్వరస్వామి వారి దర్శనాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది.

మే 31వ తేదీ వరకు ఆర్జిత సేవలన్నింటినీ రద్దు చేస్తున్నట్టు తెలిపింది. ఈ సేవల కోసం ఇప్పటికే బుక్ చేసుకున్న భక్తులు, వారి టికెట్ వివరాలను, బ్యాంక్ ఖాతా నంబర్, ఐఎఫ్ఎస్సీ కోడ్ ను పంపాలని సూచించింది. [email protected] కి వివరాలను పంపాలని టీటీడీ అధికారులు తెలిపారు.

Related posts