కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి వేంకటేశ్వరస్వామి ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను రేపటి నుంచి విడుదల చేయనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. అక్టోబరు నెలకు సంబంధించి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను రేపు విడుదల చేయనున్నారు.
భక్తులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని టీ టీ డీ అధికారిక వెబ్ సైట్ tirupatibalaji.ap.gov.in లో ప్రత్యేక ప్రవేశ దర్శనం బుక్ చేసుకోవాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. రోజుకి 8వేల చొప్పున టిక్కెట్లును విడుదల చేయనుంది.
ఇదిలా ఉండగా.. రేపటి నుంచి తిరుపతిలో సర్వదర్శన టోకెన్ల జారీని నిలిపివేయనున్నారు. ఉచిత దర్శనం టికెట్ల కోటాను ఈ నెల 24 నుంచి ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు టీటీడీ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రొసీజర్ ఫాలో అయితే జగన్ ప్రశ్నిస్తున్నారు: యనమల