తిరుమలలో భక్తుల రద్దీ వేసవి సెలవులు కావడంతో పెరిగింది. వైకుంఠంలోని అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయి వెలుపలకు క్యూలైన్లు వచ్చాయి. దీని తో సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుండగా నడకదారిన వచ్చేవారు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది.
భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. సోమవారం శ్రీవారిని 1,00,912 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.9 కోట్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు.